షూస్‌ లో సెల్ ‌ఫోన్ ‌తో కౌంటింగ్ కేంద్రంలోకి ఎంఐఎం అభ్యర్థి భర్త

షూస్‌ లో సెల్ ‌ఫోన్ ‌తో కౌంటింగ్ కేంద్రంలోకి ఎంఐఎం అభ్యర్థి భర్త

హైదరాబాద్: GHMC ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్‌ ఫోన్‌ లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ ఫోన్‌ తో ప్రవేశించడం కలకలం రేపింది. ఎవరూ గుర్తించకుండా సెల్‌ ఫోన్‌ ను షూస్‌ లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే షరీఫుద్దీన్‌ ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు తీసుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ కి తరలించారు.