నాలుగు గ్యారంటీలు అమలు చేశాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్

నాలుగు గ్యారంటీలు అమలు చేశాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్

రాయికల్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండింటిని చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్ ​అన్నారు. రాయికల్​పట్టణంలో రూ.7.20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​తో కలిసి శనివారం భూమిపూజ చేశారు. 

మహిళా సంఘ సభ్యులకు రూ.11 లక్షల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కు, ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ​చెక్కులు అందించారు. కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్​కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్, కమిషనర్ నాగరాజు,  కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజెంగి నందయ్య , మున్సిపల్ మాజీ చైర్మన్ హనుమాండ్లు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి

రాయికల్​ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జర్నలిస్టుల జేఏసీ అధ్యక్షుడు చింతకుంట సాయికుమార్​ కోరారు. మంత్రి లక్ష్మణ్​కుమార్​కు జర్నలిస్టులతో కలిసి వినతిపత్రం అందించారు.

జగిత్యాలలో పరిణామాలపై అధిష్ఠానం ఆరా.. 

రాయికల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి లక్ష్మణ్​కుమార్​ హాజరై మాట్లాడారు. జగిత్యాల పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోందన్నారు. కాంగ్రెస్​ జెండా మోసిన కార్యకర్తలకు మున్సిపల్​ఎన్నికల్లో సీట్లు ఇచ్చే వైఖరితోనే ఉందని చెప్పారు. రాయికల్ ​మాదిగ కుంట అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జీవన్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మాజీ జడ్పీటీసీ గోపి మాధవి, పట్టణ అధ్యక్షుడు రమేశ్, మహిళా అధ్యక్షురాలు మమత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాలావత్​ ప్రసాద్ తదితరులున్నారు.