స్వాతంత్య్ర వేడుకల్లో సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి, స్పీకర్​

స్వాతంత్య్ర వేడుకల్లో సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి, స్పీకర్​

మధ్యప్రదేశ్​లో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి, స్పీకర్​ అస్వస్థతకు గురయ్యారు. రాయ్​సేన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్​మినిస్టర్​ప్రభురామ్​చౌధరి భద్రతా సిబ్బందితో గౌరవ వందనం స్వీకరిస్తున్నప్పుడు కుప్పకూలారు. 

అప్రమత్తమైన పోలీసులు ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మౌగంజ్​లో అసెంబ్లీ స్పీకర్​ గిరీవ్​గౌతమ్​కు సైతం ఇలాంటి అనుభవాని గురయ్యారు. 

జెండా ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా.. ప్రసంగం మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.