ఇఫ్తార్ విందులో మంత్రి దామోదర

ఇఫ్తార్ విందులో మంత్రి దామోదర

టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా కాంగ్రెస్​మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మజార్ ఆదివారం టేక్మాల్ లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేక్మాల్ దర్గాలో మంత్రి  ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి పండ్లు, మిఠాయిలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​అధ్యక్షుడు రమేశ్, నాయకులు కిషన్, మల్లారెడ్డి, సత్యనారాయణ, పాపయ్య, నరసింహారెడ్డి, భూమయ్య, సాగర్, కిషోర్, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.