బడంగ్​పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బడంగ్​పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రంగారెడ్డి, వెలుగు : కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. శనివారం బడంగ్​పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.38 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేజి మీదకు చేరుకునే టైంలో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రోటోకాల్ అంశాన్ని లేవనెత్తారు.

ఇది ప్రభుత్వ కార్యక్రమమా? కాంగ్రెస్ కార్యక్రమమా? అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చే నెల 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా అభివృద్ధి ఆగదన్నారు. మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.