పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

జనగామ: పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని పాలకుర్తిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. స్థానికులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. వారితో కలిసి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని మంత్రి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు పల్లెప్రగతి కార్యక్రమం ఉంటుందన్నారు. పల్లెల్లో పారిశుధ్యం, పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పరిశుభ్రంగా మారుతాయన్నారు. ఇప్పటికే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సెగ్రికేషన్‌ షెడ్డులు పూర్తి చేశామన్నారు.

మరిన్ని వార్తల కోసం...

యూపీ సీఎం యోగీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..

ఫుడ్ డెలివరీ బాయ్‌‌ని కొట్టిన కానిస్టేబుల్