బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు

బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు

మహబూబాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని పెద్ద వంగరలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులం, మతం పేరుతో  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా కూడా కూడా లేవని మంత్రి స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలు అమలు చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు.

దేశంలో తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశంలో అమలు చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని తెలిపారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పీడ విరగడ కావాలంటే కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను బొంద పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక ప్రజానిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.