యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు 

యాదాద్రి నర్సన్నను  దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకున్నారు. ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లికి  ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు.

మరోవైపు యాదగిరిగుట్టకు భక్తులు పొటెత్తారు. నూతన సంవత్సరం కావడం, అదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అటంకాలు ఎదురుకాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  భక్తుల కోసం ఏకంగా లక్ష లడ్డూలను రెడీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టారు.