ప్రస్తుతానికి లాక్ డౌన్ ఆలోచనలు లేవని..రాష్ట్రం సేఫ్ గా ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాలయిన మహారాష్ట్ర , కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా ఉన్నాయన్నారు. సరిహద్దు దగ్గర కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టబోమన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల దగ్గర జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా విషయంలో అలసత్వం వద్దన్నారు.
టెస్టింగ్ కిట్స్ ధర చాలా తగ్గాయన్నారు. పగటి పుట వేడి, రాత్రి చల్లదనం ఉంటే.. వైరస్ వ్యాపి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారన్నారు. మరొక 15..20 రోజుల్లో ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది కాబట్టి.. వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ ను బయటి మార్కెట్ లో అందుబాటులో ఉండేలా కేంద్రం చూడాలన్నారు. కరోనా విషయంలో నిరంతరం రీసెర్చ్ జరుగుతుండాలన్నారు. హార్డ్ ఇమ్యూనిటీ వచ్చింది.. అలాగే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి కరోనా మరింత తగ్గొచ్చన్నారు.