కరీంనగర్, మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. 40మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అర్హులైన తమకు ఇళ్లు రాలేదంటూ పలువురు నిరసనకు దిగారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో అర్హులైన అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం..