మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

విజయవాడ: తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు ఏర్పరుచుకున్న స్థానం సుస్థిరమైంది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా.. రాజకీయ వేదికైనా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు  హిందూపురం ఎమ్మెల్యే 'నటసింహ' నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా జరగనున్నాయి. 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరు, సాయంత్రం తెనాలిలో ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకృష్ణ ప్రారంభిస్తున్నట్లు  తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంటే.. 10 కోట్ల మంది తెలుగు వారికి పండగ లాంటిదే. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. స్వర్గీయ తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

మరిన్ని వార్తలు...

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే...

నేపాల్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం