కేసీఆర్ను సాదుకోవాల్నా.. సంపుకోవాల్నా.. మీరే ఆలోచించాలె: హరీశ్ రావు

కేసీఆర్ను సాదుకోవాల్నా.. సంపుకోవాల్నా.. మీరే ఆలోచించాలె: హరీశ్ రావు

వరంగల్: కాంగ్రెస్ గెలిస్తే జనం రిస్క్ లో పడ్తరని, మా జిమ్మెదారి ఉండదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవుడికి ఐదు మొక్కితే ఒకటో రెండో కోరికలు తీరుతాయని, కేసీఆర్ అంతకన్నా ఎక్కువే చేశారని అన్నారు. అలాంటి కేసీఆర్ ను సాదుకోవాల్నా.. సంపుకోవాల్నా మీరే ఆలోచించుకోవాలని ఓటర్లను  కోరారు. ఇవాళ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 

కర్నాటకలో ఐదు గ్యారెంటీలు అని చెప్పిన కాంగ్రెస్ సర్కారు కరెంటు బందు పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గిరిజన బంధు ఇస్తామని అన్నారు. ‘కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేకాట క్లబ్బులు వస్తాయి. అక్కాచెల్లెళ్ల పుస్తెలు తెగుతాయి.’అని హరీశ్ రావు అన్నారు.