గాంధీని తిట్టి గాడ్సేను పొగుడుతున్నారు..

గాంధీని తిట్టి గాడ్సేను పొగుడుతున్నారు..

సిద్దిపేట జిల్లా : ఇంటింటికి జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి కామెంట్స్ అవమానకరంగా ఉన్నాయని, జాతీయ జెండాలు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్రప్రభుత్వమే ఉందన్నారు. ఇవాళ కొందరు నాయకులు గాంధీని తిట్టి..గాడ్సేను పొగుడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీని తిట్టిన వారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారని, దేశ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు.  

75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 15రోజుల పండుగగా జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలో 570 థియేటర్లలో స్కూలు విద్యార్థులకు గాంధీ సినిమా చూపిస్తున్నామని చెప్పారు.