పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : హరీశ్​ రావు

 పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : హరీశ్​ రావు

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ ను ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధిలో వైశ్యుల పాత్ర ఎంతో ఉందని, రెండు దశాబ్దాల క్రితమే సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఫంక్షన్ హాల్ కు స్థలాన్ని సేకరించారని గుర్తు చేశారు.  

అంతకు ముందు దుబ్బాక ఐఓసీ ని మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ తో కలసి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేశ్​, ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ లు పాల్గొన్నారు.