
వ్యవసాయ బిల్లులకు పూర్తి మెజారిటీ లేకపోయినా మూజువాణి ఓటుతో బిల్ పాస్ చేయించుకోవడం సక్రమమేనా అని ప్రధాని మోడీని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానమని హరీష్ అడిగారు. ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్థించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి అని హరీష్ అన్నారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా వ్యవసాయ బిల్లులను తీసుకురావడం న్యాయమా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం వల్ల తెలంగాణ బిల్లు పాసయిందని.. ఆ బిల్లు ఆమోదం పొందడం అన్యాయమంటన్నారే.. ఇదెక్కడి న్యాయం అని హరీష్ అడిగారు.
బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతి పక్షాలు డివిజన్ ఆడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా?
— Harish Rao Thanneeru (@trsharish) February 9, 2022
ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?
1/3
For More News..