- కావాలంటే వడ్డీతో మూడు కిస్తీల్లో కట్టుకోండి
- ఇండ్లలో కరెంటు వాడేవారికే ఈ చాన్స్
- బిల్లుల శ్లాబ్ మారడమనేది ఎప్పట్నుంచో ఉన్నదే
- డౌట్లు తీర్చేందుకు హెల్ప్డెస్క్: మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనేది అనుమానం మాత్రమేనని.. బిల్లులు ఏం ఎక్కువ రాలేదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కరెంటు బిల్లులు భారీగా వస్తున్నాయన్న కంప్లైంట్లు పెరిగిపోవడంతో.. సోమవారం హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల కరెంటు బిల్లు చూడగానే అందరికీ అనుమానం వచ్చిందని, కానీ పైసా ఎక్కువ రాలేదని చెప్పారు. మూడు నెలల బిల్లు కావడం, ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వాడటంతో శ్లాబ్లు మారి ఎక్కువ వచ్చినట్టుగా భావిస్తున్నారన్నారు. ఈ నెల ఇచ్చిన బిల్లులు కరెక్టేనని.. 1.5 శాతం వడ్డీతో మూడు కిస్తీల్లో కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జూన్లో 30 శాతం, జులైలో 40 శాతం, ఆగస్టులో 30 శాతం చొప్పున రెగ్యులర్ బిల్లులతో కలిపి కట్టుకోవాలని సూచించారు. అంతేతప్ప ఈ నెల బిల్లు కట్టకపోతే కరెంటు కట్చేస్తామని మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. ఈ కిస్తీల రూపంలో కట్టే బిల్లులను విద్యుత్సంస్థల వినియోగదారుల కేంద్రాల్లో(ఈఆర్వో) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కిస్తీల విధానం కేవలం ఇండ్లలో కరెంటు వాడే వారికేనని తెలిపారు.
ఎమ్మెల్యేలే అయోమయంల పడ్డరు
కరెంటు బిల్లులకు స్లాబ్జంప్అనేది ఎప్పుడైనా ఉన్నదేనని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. నెల నెలా మీటర్రీడింగ్తీసే అవకాశం లేకనే.. ఈఆర్సీ ఆదేశం మేరకు మూడు నెలల బిల్లును సరాసరి చేసి ఇచ్చామన్నారు. పైగా పేపర్, కరెన్సీ నోట్లపై కూడా కరోనా వైరస్వస్తుందన్న ఆందోళనలతో రీడింగ్తీయడం సాధ్యపడలేదన్నారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్కు రూ.18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేలు బిల్లురావడంతో అయోమయానికి గురై తన వద్దకు వచ్చారన్నారు. ఎనర్జీ సెక్రటరీ అజయ్మిశ్రాకు రూ.21 వేలు బిల్లు వచ్చిందని.. అధికారులు వారందరికీ పూర్తిగా వివరించడంతో అర్థమైందని తెలిపారు. కరెంట్బిల్లుల్లో తేడాలు, అనుమానాలను ఉంటే నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ఏర్పాటు చేస్తామని చెప్పారు.