వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో ఆలస్యం చేయవద్దు : జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో ఆలస్యం చేయవద్దు : జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు
  • విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

నాగర్​ కర్నూల్, వెలుగు:  వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రానీయకుండా, అప్లై చేసుకున్న రైతులందరికీ కనెక్షన్లు ఇవ్వాలని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్​లో కొల్లాపూర్​ నియోజకవర్గ విద్యుత్​ సమస్యలపై మంత్రి రివ్యూ నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్  కనెక్షన్లు, లైన్ల నిర్మాణం, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్ ఫార్మర్ల కెపాసిటీ పెంపు, సబ్  స్టేషన్లలో అదనపు ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు, పాత ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంపు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. 

డిమాండ్​ మేరకు కొత్త సబ్​స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు. ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్  లైన్లు,  ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. కొల్లాపూర్​ నియోజకవర్గంలో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెక్షన్లు, పోల్స్, వైర్లు, ట్రాన్స్​ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డిమాండ్​ను బట్టి కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొల్లాపూర్  ఆసుప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రిలో విద్యుత్  స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫరాలో త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చూ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యలు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెత్తుతున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెంట్  కోతల కారణంగా డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిస్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిరెడ్డి నారాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, నాగర్ కర్నూల్​ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు.