జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చింత బాయి తండాలో ఈ నెల 24న ఎండిపోయిన వరి పొలా లను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు.. కాంగ్రెస్లక్ష్యంగా విమర్శలు చేశారు. తాజాగా మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ అవే వ్యాఖ్యలు రిపీట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు సాగునీరు , కరెంట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
హరీశ్ కామెంట్స్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీశ్రావు కరువు పరిస్థితులను వాడుకుంటున్నారని, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయో చెప్పాల్సింది హరీశ్రావు కాదని పేర్కొన్నారు. పంట నష్టంపై ఆఫీసర్లు సర్వే చేస్తున్నారని, ఆ రిపోర్ట్రాగానే పరిహారం అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ పంట నష్టపరిహారం చెల్లించని హరీశ్రావు ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు.
సాగునీటి సమస్యకు కారణమైన బీఆర్ఎస్ నాయకులే కరువు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. కరెంట్పై హరీశ్ వాస్తవాలు తెలుసుకోవాలని, నిరుడు జనవరితో పోలిస్తే 2024 జనవరి లో 10 నుంచి-20 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగిందని ఆయనకు తెలియకపోవడం శోచనీయమని చురకలంటించారు.