
ఓయూ, వెలుగు: రాష్ట్ర ఆదాయాన్ని పెంచ డంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని, అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలని ఆ శాఖ మంత్రి జూపల్లి
కృష్ణారావు సూచించారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. ‘గ్లోబల్ టూరిజం న్యూ ఎవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్’ అనే అంశంపై గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో మూడు రోజుల సెమినార్ను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో కలిసి జూపల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మొదటి రోజు గ్లోబల్ టూరిజం, రెండో రోజు నేషనల్ టూరిజం, చివరి రోజు తెలంగా ణ టూరిజంపై ఈ సదస్సులో చర్చిస్తామన్నా రు. ఈ సదస్సు నుంచి వచ్చే సలహాలు, సూచనలను తీసుకొని టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సదస్సులో ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్ వెంకటరమణ, ఐపీఈ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ చెన్నప్ప, కాన్ఫరెన్స్ చైర్మన్ ఎం.గంగాధర్, కాన్ఫరెన్స్ కన్వీనర్లు కృష్ణ చైతన్య, ఇంద్రకంటి శేఖర్, ప్యాట్రిక్, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.