- నల్గొండలో నూతన స్కిన్ కేర్ సెంటర్ ను ప్రారంభించి న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్ అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లాలిత్య స్కిన్లేజర్సెంటర్హాస్పిటల్ను ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్కు దీటుగా నల్గొండలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మంచి వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రి నెలకొల్పడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులు తీసుకోవాలన్నారు. ప్రజలు నల్గొండలో ఉండే ఆసుపత్రులను సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు పొందాలని సూచించారు.
డాక్టర్ లాలిత్య మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చర్మ వ్యాధులకు చికిత్సలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహాన్రెడ్డి, డాక్టర్లు గౌరిశ్రీ, హారినాథ్, లాలిత్య, పుల్లారావు, అనితరాణి, కార్పొరేటర్లు, మెడికల్ విభాగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.
