
నల్గొండ అర్బన్, వెలుగు : తిప్పర్తి మండల కేంద్రంలోని ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
పనుల గురించి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య. మాజీ సర్పంచ్ గుండా సత్యనారాయణ. మైనార్టీ మండల నాయకుడు మహ్మద్ గౌస్ పాషా తదితరులు ఉన్నారు.