జగిత్యాల (వెల్గటూరు) వెలుగు: ‘మొన్నటి ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు..వచ్చే ఎన్నికల్లో కూడా వేస్తే వేయండి
లేకుంటే లేదు.. మీ ఇష్టం ’అంటూ గ్రామస్తుల మీద మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ముంపుగ్రామమైన మొక్కట్రావుపేటలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తనకు ఓట్లు వేయకపోయినా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఫైలును ముఖ్యమంత్రి ఆఫీసు కు పంపినట్టు చెప్పారు. ప్యాకేజీ వస్తే సంతోషం.. లేకుంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దంటూ ఆయన కోపాన్ని ప్రదర్శించారు.