
హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్పై అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులు, పన్నులను తగ్గించకుండా.. విండ్ ఫాల్ ట్యాక్స్పేరిట ఆయిల్ కంపెనీలకు పన్నులను తగ్గించిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కార్పొరేట్లకు వరాలిచ్చి సామాన్యులపై భారం మోపడమే బీజేపీ సర్కార్ పాలసీ అన్నారు. ఈ కార్పొరేట్కంపెనీలు సంపాదించిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందో అందరికీ తెలుసన్నారు. రష్యా, ఉక్రెయిన్యుద్ధం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్తూ.. ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకున్నదన్నారు.
మోడీ మిత్రులకు చెందిన 2 కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకే విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించిందన్నారు. రష్యా నుంచి తక్కువ రేటుకు ఆయిల్ను కొనడం వల్ల దేశంపై రూ.35 వేల కోట్ల భారం తగ్గిందంటూ కేంద్రం చెప్పిందని.. మరి, ఆ లాభం ఒకట్రెండు కంపెనీలే వెనకేసుకున్నాయా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్పై 2014 నుంచి రాష్ట్ర సర్కార్ వ్యాట్ను పెంచకున్నా.. తగ్గించడం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు.