నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం నాడు పరామర్శించారు. సెప్టెంబర్ 30వ తేదీన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్య పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా నాయినిని పరామర్శించారు. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో నాయిని చికిత్స పొందుతున్నారు.

కరోనా సోకడానికి ముందునే నాయిని నర్సింహారెడ్డికి గుండె ఆపరేషన్ జ‌రిగింది. గుండె ఆపరేషన్ తర్వాత ఆయన కరోనా బారినపడ్డారు. నాయిని సతీమణి, పెద్ద కొడుకు, అల్లుడికి కూడ కరోనా సోకిందని సమాచారం. నాయిని సతీమణిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.