మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చినం

మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చినం

మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన..ప్రత్యేకంగా వీ హబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడీ, ఆశాకార్యకర్తలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు షీటీమ్ లు తీసుకొచ్చామన్నారు. మహిళలకు రాజకీయ అవకాశం కల్పించడమే లక్ష్యంగా 50శాతం రిజర్వేషన్లు కల్పించామని..అమ్మఒడి, కేసీఆర్ కిట్ సహా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 

33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఏ రాష్ట్రంలో చేయని అభివృవద్ధిని రాష్ట్రంలో చేస్తున్నామన్నారు. బాలికల గురుకులాలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా సొంత నిధులతో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు వందల పెన్షన్ను 2వేలకు పెంచామని..4 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.  అగస్ట్ 15 నుంచి 57ఏళ్లు నిండిన అర్హులకు కొత్త  పెన్షన్లు ఇస్తామన్నారు.