డిసెంబర్ 3న ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : మంత్రి కేటీఆర్

డిసెంబర్ 3న ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : మంత్రి కేటీఆర్

ఉప్పల్, వెలుగు : డిసెంబర్ 3న ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం రాత్రి ఉప్పల్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షో పాల్గొన్న కేటీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ అందరినీ చూస్తుంటే ఉప్పల్​లో పోటీ లేకుండా ఎలక్షన్ అయిపోయినట్లు కనిపిస్తోందన్నారు.

ఇదే ఉత్సాహంతో ఈ నెల 30న అందరూ ఓటింగ్ లో పాల్గొని కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను  ఆయన కోరారు. ఉప్పల్ ను అన్ని విధాలుగా డెవలప్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.  ఉప్పల్ కు ఐటీ కంపెనీలు రావాలన్నా, మూసీ బ్యూటిఫికేషన్ జరగాలన్నా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలన్నా బీఆర్ఎస్ మరోసారి అధికారంలో రావాలని కేటీఆర్ తెలిపారు.