
మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్ని్ంచనున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పార్టీ లీగల్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది. కేటీఆర్ అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్ తో భేటీ కానున్నారు. రేపు, ఎల్లు్ండి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.