మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో నిరసన సెగ

మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో నిరసన సెగ
  • మేడ్చల్ జిల్లా అద్రాస్​పల్లిలో మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న గ్రామస్తులు
  • సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

శామీర్ పేట, వెలుగు: మంత్రి మల్లారెడ్డికి మరోసారి సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. శుక్రవారం మేడ్చల్ సెగ్మెంట్ పరిధి మూడుచింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి మరో గ్రామానికి వెళ్తుండగా.. అద్రాస్ పల్లి, ఎల్లగూడెం గ్రామాల జనం మంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్నారు. 

తమ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేశారు. మల్లారెడ్డిని అద్రాస్ పల్లి, ఎల్లగూడెం గ్రామాలకు తీసుకెళ్లి దాదాపు గంట పాటు పర్యటించేలా చేశారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లు సరిగా లేవని, కరెంట్ వైర్లు చేతికి తాకేలా వేలాడుతున్నాయని గ్రామస్తులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మల్లారెడ్డి విద్యుత్ అధికారిని పిలిపించి కరెంట్ సమస్యలనువెంటనే పరిష్కరించాలని సూచించారు. తొందరలోనే మిగతా సమస్యలను పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.