
గురువారం ( జూన్ 19 ) మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రతి ఒక్కరి ఆలోచన ఉందని అన్నారు.ఏపీ తిరిగి గాడిన పడటానికి కేంద్ర మంత్రులందరూ శ్రద్ధ చూపారని.. ఏపీకి అవసరమైన సహాయ సహకారాలు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు.ప్రధాని మోదీతో భేటీ తన జీవితంలో కీలక మలుపు అని.. ప్రధాని మోదీతో భేటీ మాటల్లో వర్ణించలేనని అన్నారు లోకేష్. ఎవరికీ ఇవ్వని సమయం ప్రధాని తనకు ఇచ్చారని.. మోదీ తనకు గొప్ప ప్రేరణ, స్ఫూర్తినిచ్చారని అన్నారు.
మునుముందు ఇంకా ఎలా ఎదగాలో సూచనలు చేశారని.. మోదీతో సమావేశం తర్వాత ఆయన మాటలు మననం చేసుకున్నానని అన్నారు లోకేష్. సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా నమోదైన కేసుల గురించి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని.. తప్పు చేసినవారిని చట్టప్రకారం శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు లోకేష్.
ఇదిలా ఉండగా.. బుధవారం ( జూన్ 18 ) సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా కారు ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మరణించడం వివాదాస్పదంగా మారింది. సింగయ్యను ఢీకొన్న వాహనం జగన్ కాన్వాయ్ లోనిదే అంటూ టీడీపీ ఆరోపిస్తున్న క్రమంలో ఇరు పార్టీల మధ్య వార్ మరింత ముదిరింది. అయితే.. సింగయ్యను ఢీకొన్న వాహనం జగన్ కాన్వాయ్ లోది కాదని.. ప్రైవేట్ వాహనం ఢీకొని సింగయ్య మరణించారని స్పష్టం చేశారు గుంటూరు ఎస్పీ సతీష్. అక్కడున్నవారు సింగయ్యను గమనించి ఆసుపత్రికి తరలించారని అన్నారు ఎస్పీ సతీష్.