విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా

విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచన  చేశారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.