కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. సుమారు 26 గంటలకు పైగా మంత్రి పార్థాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. చివరకు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Enforcement Directorate (ED) team arrests former West Bengal Education Minister, Partha Chatterjee from his residence in Kolkata. The team had been here since yesterday in connection with the SSC recruitment scam. pic.twitter.com/iGkfQNlF0X
— ANI (@ANI) July 23, 2022
శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఇళ్లల్లో ఈడీ అధికారుల దాడులు కొనసాగాయి. అదే సమయంలో పార్థాతో దగ్గరి సంబంధాలు ఉన్న అర్పిత ముఖర్జీ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టి.. సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు పార్థా ఛటర్జీ.. టీఎంసీ సెక్రెటరీ జనరల్గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖలో అవినీతితో పాటు తన శాఖల్లోనూ ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్పై విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం ఇద్దరు బెంగాల్ మంత్రుల ఇంట్లో తనిఖీలు చేశారు. పార్థ చటర్జీ, పరేష్ అధికారి ఇండ్లలో ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఈ సోదాలు నిర్వహించారు. అలాగే పార్థ చటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ రెయిడ్లు చేశారు. ఈ సోదాల్లో అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదు దొరికింది. కుప్పలు కుప్పలుగా పట్టుబడిన ఆ నగదును బ్యాంకు అధికారుల సాయంతో లెక్కించి సీజ్ చేశారు. ఆమె ఇంట్లోంచి 20 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల సమయంలో వారి నివాసాల బయట సీఆర్పీఎఫ్సిబ్బంది కాపలా కాశారు. ఉదయం 8.30 గంటలకు ఎనిమిది మంది అధికారులతో కూడిన ఓ బృందం చటర్జీ, అర్పిత నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించగా.. మరో బృందం కూబ్బెహార్ జిల్లాలోని మేఖ్లీగంజ్లో పరేశ్అధికారి ఇంట్లో తనిఖీలు చేసింది. ఈ మూడు సోదాలన్నీ ఏకకాలంలో జరిగాయని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. అలాగే వెస్ట్బెంగాల్బోర్డ్ఆఫ్ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్మాణిక్భట్టాచార్య నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. బెంగాల్స్కూల్సర్వీస్కమిషన్రికమెండేషన్లపై గవర్నమెంట్స్పాన్సర్డ్ (ప్రభుత్వ ప్రాయోజిత), ఎయిడెడ్స్కూళ్లలో టీచర్పోస్టులతో పాటు గ్రూప్సీ, గ్రూప్డీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది. ఆ దర్యాప్తులో భాగంగా ఎంత మేరకు డబ్బులు మారాయన్న దానిపై ఈడీ ఎంక్వయిరీ చేస్తున్నది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్న పార్థ చటర్జీ.. ఈ స్కామ్ జరిగినపుడు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఆయనను ఈ ఏడాది ఏప్రిల్26న, మే 18న ప్రశ్నించింది. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి పరేశ్ అధికారిని కూడా కూచ్బెహార్లో ఈడీ విచారించింది. పరేశ్ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన కోల్కతాలో ఉన్నారు.
This is evidence of the fact that how people's money is being sacrificed for corruption in Bengal. People will get to completely know about it, I am confident: Union Minister Jyotiraditya Scindia on West Bengal SSC scam pic.twitter.com/qlxqMP335P
— ANI (@ANI) July 23, 2022
బీజేపీపై టీఎంసీ ఎదురుదాడి
ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. అయితే దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ముందు ఉందంటూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే బీజేపీ సర్కారు కుట్రపన్నిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈడీని తమ నేతపై ఉసిగొల్పిందని మండిపడ్డారు. అయితే, టీచర్ రిక్రూట్మెంట్లో టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని, నచ్చినవాళ్లకు పోస్టులు ఇచ్చుకున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ‘‘టీఎంసీ లీడర్లు, వాళ్ల అనుచరులు అర్హతలేని వ్యక్తులకు జాబ్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ఈడీ, సీబీఐ తేలుస్తున్నాయి. ఈ స్కాంలో మరిన్ని తలకాయలు బయటపడతాయి” అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
#WATCH | West Bengal cabinet minister and former Education Minister of the state Partha Chatterjee at ESI Joka Medical hospital with ED officials
— ANI (@ANI) July 23, 2022
Earlier today the minister was arrested by ED from his Kolkata residence in connection with the SSC recruitment scam pic.twitter.com/u5Z2TTGrMq