ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.99 కోట్ల చెల్లింపు..ఇప్పటికే 388 ఇండ్ల నిర్మాణాలు పూర్తి: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.99 కోట్ల చెల్లింపు..ఇప్పటికే 388 ఇండ్ల నిర్మాణాలు పూర్తి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 388 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు, గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సోమవారం నాటికి ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.98.64 కోట్లను దశల వారీగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల ప‌‌‌‌థకానికి సంబంధించి రాష్ట్రంలో 9,877 ఇండ్ల బేస్‌‌‌‌మెంట్ పూర్తి కాగా, 1,839 ఇండ్లు గోడలు పూర్తయ్యాయని, 388 ఇండ్లు స్లాబ్స్ పూర్తయ్యాయన్నారు.

స్లాబ్‌‌‌‌ పూర్తయిన 388 ఇండ్లకు మొత్తం రూ.98.64 కోట్లు విడు ద‌‌‌‌ల చేశామ‌‌‌‌న్నారు. గ‌‌‌‌త ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వ‌‌‌‌ల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇందిర‌‌‌‌ మ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వానికి ప‌‌‌‌ర్యవేక్షణ మాత్రమే ఉంటుంద‌‌‌‌ని, నిర్మాణ బాధ్యత‌‌‌‌ల‌‌‌‌ను తాము చేప‌‌‌‌ట్టడం లేద‌‌‌‌ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 250 మండ‌‌‌‌లాల్లో ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణ జ‌‌‌‌రుగుతున్నద‌‌‌‌ని, ల‌‌‌‌బ్ధిదారుల‌‌‌‌కు ఇంజినీర్లు నిర్మాణ ప‌‌‌‌నుల్లో స‌‌‌‌హ‌‌‌‌కారాన్ని అందించాల‌‌‌‌ని సూచించారు.