ప్రజల సొమ్మును దోచుకున్న ఎవర్నీ వదలం.. కమిషన్ రిపోర్ట్ తర్వాత చర్యలు

ప్రజల సొమ్మును దోచుకున్న ఎవర్నీ వదలం.. కమిషన్ రిపోర్ట్ తర్వాత చర్యలు

 ప్రజల సొమ్మును దోచుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదని చెప్పారు పొంగులేటి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు .

గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టింది.  దొంగ మాటలు చెప్పి కాళేశ్వరం కట్టారు.  ప్రజల సొమ్మును దోచుకున్నారు . అభివృద్ధి అనే ముసుగులో బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దోచుకుంది.  కమీసన్ల కోసం ప్రాజెక్ట్  నాణ్యతను గాలికొదిలేశారు.  కట్టిన యేడాది లోపే కూలింది.   ప్రాజెక్టు వంకతో ప్రజలు సొమ్మును దోచుకున్నారు. కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారం చర్యలు ఉంటాయి. ప్రజల సొమ్మును దోచుకున్న ఎవర్నీ వదలం. ఎంత పెద్దవాళ్లైనా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ALSO READ | కాళేశ్వరం కమిషన్ ఎదుట.. ముగిసిన కేసీఆర్ విచారణ.. హైలైట్స్ ఇవే..

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను విచారించిన సంగతి తెలిసిందే..దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ ను  విచారించిన కమిషన్  దాదాపు 18 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం  కేసీఆర్ మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు.