పదేండ్లలో ఒక్క బస్సు కొనలే .. ఒక్క ఉద్యోగమియ్యలే : మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఒక్క బస్సు కొనలే .. ఒక్క ఉద్యోగమియ్యలే : మంత్రి పొన్నం ప్రభాకర్
  • గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితి
  • కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ లాభాల బాట
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​
  • ఎల్లారెడ్డిలో కొత్త బస్టాండ్ ప్రారంభం​

ఎల్లారెడ్డి, వెలుగు : బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో ఆర్టీసిలో కొత్తగా ఒక్క బస్సు కొలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లాభాల బాట పడుతోందని వివరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రూ. 4 . 50 కోట్లతో నిర్మించిన బస్టాండ్  మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మీసన్​పల్లిలో రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు ఉచితంగా 190 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా రూ. 6వేల కోట్ల చెల్లింపులు చేశామన్నారు. స్టేట్​లో కొత్తగా పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో రెండు ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి , జుక్కల్​ ఎమ్మెల్యేలు మదన్​ మోహన్​రావు, తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ రాజేష్​చంద్ర, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.