
- 14 న రంగం..జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం
- బోనాల ఉత్సవాలపై సమీక్ష
హైదరాబాద్ సిటీ,/ పద్మారావునగర్, వెలుగు: జూలై 13 జరగనున్న సికింద్రాబాద్ (లష్కర్) ఉజ్జయినీ మహంకాళీ బోనాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సనత్నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు, కలెక్టర్ హరిచందన, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి లష్కర్మహంకాళీ టెంపుల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ జూలై 13న లష్కర్బోనాలు, 14న రంగం ( భవిష్యవాణి) తర్వాత అమ్మవారిని అంబారీపై ఊరేగించడం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఊరేగింపులో తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. లష్కర్తో పాటు గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా బోనాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, ఆలయ కమిటీ చైర్మన్ కామేశ్వర్
పాల్గొన్నారు.