కేసీఆర్‌కు థాంక్స్ చెప్పిన మంత్రి సబితా

కేసీఆర్‌కు థాంక్స్ చెప్పిన  మంత్రి సబితా

అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహిళ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏటా 10 వేలు పంట పెట్టుబడి సహాయంగా అందిస్తూ రైతు బంధుగా, మహిళలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మహిళ బంధు అయినట్లే, ఇప్పటికే ఒక లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి నేడు 90 వేల పై చిలుకు ఉద్యోగాల ప్రకటనతో యువత బంధు అయ్యారని మంత్రి పేర్కొన్నారు. 

ఉద్యోగ క్యాలెండర్ తో ప్రభుత్వ శాఖల్లో ప్రతి సంవత్సరం ఖాళీలు తెలిసి వెంటనే నియామకాలు జరిపే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిరుద్యోగ యువత తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని శాఖాల్లో ఉద్యోగాల భర్తీకి  భారీగా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనపై సర్వత్రా సంబరాలు మిన్నంటాయి. యువత సీఎం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌కు ధన్యవాదాలు తెలిపారు.