
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలను అందిస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ లో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆమె బతుకమ్మ చీరలను అమ్మవారికి సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. కోటి మందికి కోటి చీరలను పంపిణీ చేస్తామన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్ తండ్రిగా, మేనమామగా, అన్నగా ఉంటున్నాడన్నారు. కేబినెట్ లో మహిళ మంత్రిగా ఉండడం తన అదృష్టమన్నారు. నేతన్నకు అండగా ఉంటూ సీఎం కేసీఆర్ ఉపాదిని కల్పించారన్నారు. నాణ్యతకు రాజీ పడకుండా 255 రకాల చీరలను డిజైన్ చేయించామన్నారు.
ప్లాస్టిక్ పరేషాన్.. సముద్ర గర్భంలో కోటి 40 లక్షల టన్నుల ప్లాస్టిక్