రాహుల్ పీఎం కావాలంటే..పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలవాలి: మంత్రి శ్రీధర్బాబు

రాహుల్ పీఎం కావాలంటే..పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలవాలి: మంత్రి శ్రీధర్బాబు

పెద్దపల్లి: కార్మికుల పక్షపాతిగా నిరంతరం పోరాటం చేసిన కాకా వెంకటస్వామి వారసుడిగా గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాక వెంకటస్వామి బాటలో.. ఆయన వారసుడిగా పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ..సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంట్ లో సింగరేణి కార్మికుల తరపున గళం వినిపిస్తారని చెప్పారు. 

కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కార్మికుల కోసం కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా కారుణ్య నియామకలు అందేలా చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరువేరుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.జూన్ 6 తర్వాత రామగుండం నుంచే కార్మికుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. 
రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే పెద్దపల్లి నుంచి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.