
షర్మిల రాజకీయ పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని ఆయన అన్నారు. ‘చిరంజీవి- పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడితే ఏమైందో ప్రజలు చూశారు. షర్మిల పార్టీ పెట్టినా అదే అవుతుంది. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోంది. ఎవ్వరూ వచ్చినా ఇబ్బంది లేదు. షర్మిల ఎవ్వరి బాణం కాదు. ఏపీలో ఏమీ చేయలేక ఆమె ఇక్కడకు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి మరణించి ఆరేళ్ళు గడిచిపోయింది. పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నాం’ అని ఆయన అన్నారు.
For More News..