క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై మంత్రి తలసాని సమావేశం

క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై మంత్రి తలసాని సమావేశం

క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై మంత్రి తలసాని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. మారేడ్ పల్లిలోని తన నివాసంలో సమావేశం జరిపారు. రేపు క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ భవనం కోసం ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే.. ప్రభుత్వం నుంచి రూ.2కోట్లు మంజూరు అయ్యాయనని మంత్రి తలసాని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలను కేసీఆర్ ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తలసాని తెలిపారు. ఈనెల 13న క్రిస్టియన్లకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తామన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందుల నిర్వహణ ఉంటుందని తలసాని శ్రీనివాస్ తెలిపారు.