భైంసా ఏఎంసీ చైర్మన్​ రాజేశ్​ను చెంపపై కొట్టిన మంత్రి తలసాని

భైంసా ఏఎంసీ చైర్మన్​ రాజేశ్​ను చెంపపై కొట్టిన మంత్రి తలసాని
  • హైదరాబాద్​లో స్టీల్​ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఘటన

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ రాజేశ్ బాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ చేయిచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముథోల్​ సెగ్మెంట్​ బీఆర్ఎస్​లో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భైంసా ఏఎంసీ చైర్మన్​రాజేశ్ బాబును మంత్రి కేటీఆర్​రాజధానికి పిలిపించారు. అయితే, శనివారం హైదరాబాద్​లో స్టీల్​బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్​వచ్చారు.

 ఈ క్రమంలో కేటీఆర్​వెనుక రాజేశ్ బాబు వెళ్తుండగా.. పక్కనే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ కోపోద్రిక్తుడయ్యారు. ‘నా కంటే ముందు వెళ్తావా?’ అంటూ రాజేశ్​బాబు కాలర్​పట్టి వెనక్కి లాగడమే కాకుండా చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్​పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉన్న రాజేశ్ పై మంత్రి దాడి చేయడంతో గిరిజన సంఘాలు, ఉద్యమకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేస్తున్నారు.