3500 కుపైగా ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

3500 కుపైగా ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడిమల్కాపూర్ దేవాదాయ శాఖ కార్యాలయంలో 309 దేవాలయాలకు కోటి 3 లక్షల విలువైన  బోనాల చెక్కులను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తలసాని తెలిపారు. 3,500కుపైగా దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. గతంలో బోనాల తర్వాత చెక్కులను అందించామని.. అయితే ఈసారి బోనాలకు ముందే చెక్కులను అందించామని అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలన్నదే కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.