- చలి మంటలు వేసుకుంటే సెక్రటేరియెట్లో అగ్నిప్రమాదం జరిగింది
- అది ఏమంత సీరియస్ కాదు.. కావాలనే పెద్దది చేస్తున్నరు
- కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కు అనుమతిచ్చిన కేంద్రం ..మన సెక్రటేరియెట్ ఓపెనింగ్కు ఇయ్యలే
- తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపణ
- రేపు జీహెచ్ఎంసీలో కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హంగ్ వచ్చే చాన్స్ లేదని, నూటికి నూరు శాతం తామే గెలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టాండర్డ్స్ లేని వ్యక్తి.. ఆయన గంటకో మాట మాట్లాడుతున్నడు.. హంగూ రాదు.. బొంగు రాదు.. వన్సైడెడ్గా 2018లో ఎట్లా గెలిచినమో అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తం..” అని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, సెక్రటేరియెట్అద్భుత నిర్మాణాన్ని చూసి కొంత మంది ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ‘‘సెక్రటేరియెట్ దగ్గర పని చేసే కార్మి కులు చలిమంటలు వేసుకుంటే అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏమంత సీరియస్ కాదు. కొందరు దాన్ని కూడా పెద్దది చేసి చూపించే ప్రయత్నం చే స్తున్నరు” అని కామెంట్ చేశారు. బుధవారం తె లంగాణ భవన్లో మీడియాతో తలసాని మాట్లాడారు. కడపలో స్టీల్ ప్లాంట్ప్రారంభోత్సవానికి సీఎం జగన్కు అనుమతిచ్చిన కేంద్రం మన సెక్రటేరియట్ ప్రారంభానికి పర్మిషన్ ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్తో పొత్తు ఉండదు
తెలంగాణలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే బీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తలసాని చెప్పారు. కాంగ్రెస్తో పొత్తు అనే మాటే తలెత్తదన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విశ్వసనీయత లేదని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని తెలిపారు. ‘‘పార్టీ మారిన వాళ్లు.. బీఆర్ఎస్ను వీడిన వాళ్లు ఎట్ల ఉన్నరో ప్రజలు చూస్తున్నరు. వాళ్లు మళ్లీ వస్తామన్నా ఇక్కడ బండి ఫుల్ లోడ్తో ఉంది” అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరుంది కదా అని తాడుబొంగరం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని తలసాని దుయ్యబట్టారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి అంబర్పేటకు కిషన్రెడ్డి ఏమీ చేయలేదని విమర్శించారు. అంబర్పేట అభివృద్ధిపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేంద్ర బడ్జెట్గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టారని, ఇంకా దానిపై తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలని పేర్కొన్నారు.
ఘనంగా కేసీఆర్ బర్త్డే
శుక్రవారం కేసీఆర్ బర్త్డే వేడుకలు జీహెచ్ఎంసీలోని అన్ని డివిజన్స్లో నిర్వహిస్తామని తలసాని తెలిపారు. వేడుకలపై తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ తదితరులతో ఆయన సమీక్షించారు. అన్ని మతాల ప్రార్థన మందిరాలు, ఆలయాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేశ్ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.