ఆషాఢమాస శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని జులై 10న సికింద్రబాద్ మోండా డివిజన్.. గ్యాస్ మండి కమాన్ నుండి ఫలహారం బండి ఊరేగింపు ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమ్మద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని డ్యాన్స్ చేయడం అక్కడివారిని ఆకట్టుకుంది. పోతురాజుల నృత్యాలు, దేవుళ్ల ఊరేగింపుతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.