ఆగస్టు 25న పంజాగుట్ట వైకుంఠ మహా ప్రస్థానం ప్రారంభం : మంత్రి తలసాని

ఆగస్టు 25న పంజాగుట్ట వైకుంఠ మహా ప్రస్థానం ప్రారంభం : మంత్రి తలసాని

ఆగస్టు 25వ తేదీన పంజాగుట్ట వైకుంఠ మహా ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రూ.5 కోట్ల వ్యయంతో జరుగుతున్న స్మశాన వాటిక నిర్మాణ పనులను మంత్రి తలసానితో పాటు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవిత పరిశీలించారు. మనిషి చివరి మజిలీ ప్రశాంతంగా ముగియాలనే ఆలోచనతో స్మశాన వాటికలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు.

ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పంజాగుట్ట వైకుంఠ మహా ప్రస్థానాన్ని సుందరీకరిస్తున్నామని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కల పెంపకం చేపట్టామన్నారు. రోడ్లు, ప్రహారీ నిర్మాణం, అస్తికలను భద్రపరిచేలా లాకర్ల ఏర్పాటుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.