
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టామని, 10లోగా లింక్ కెనాలు పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజీవ్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల్లో నిర్లక్ష్యం లేకుండా, త్వరగా కంప్లీట్చేయాలని చెప్పారు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేసిన ఈ ప్రాజెక్ట్ నీటిని సాగర్ నీటి కంటే ముందుగా అందజేయాలన్నారు. మొదటి పంప్ హౌస్ నుంచి 2,3 పంప్ హౌస్ ల వరకు మెయిన్ కెనాల్ లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను తొలగించి, లైనింగ్ పనులు పూర్తి చేసి, మూడు పంప్ హౌస్ ల నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు.