తెలంగాణలో లిఫ్టులు, చెక్ డ్యాములు అసంపూర్తిగా ఉన్నాయి : ఉత్తమ్

తెలంగాణలో లిఫ్టులు, చెక్ డ్యాములు అసంపూర్తిగా ఉన్నాయి : ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి, నిరుపేదలకు ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గంలో కేవలం240 ఇండ్లు మాత్రమే మంజూరు చేసిందని, అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదన్నారు. త్వరలోనే గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అవినీతి, అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిఫ్టులు, చెక్ డ్యాములు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రామస్వామి గట్టు వద్ద ఇందిరమ్మ మోడల్ కాలనీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా అధికారులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు.