
డిసెంబర్ నాటికి నెట్టెంపాడును పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో పదేళ్ల BRS పాలనలో ఇరిగేషన్ బ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులకు మెయింటనెన్స్ కూడా చేయలేదని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.
భారీ వాహనాలను జూరాలపై నడపడం సేఫ్టీ కాదని ఆనాడే నిర్దారించారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. జూరాల డ్యామ్ కు అనుసంధానంగా మరో బ్రిడ్జికి 100 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నాము. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్తులను పట్టించుకోకపోవడంతోనే ప్రాజెక్తులు దెబ్బతింటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పూడికతీత పనులు కూడ చేపట్టలేదు. జూరాల ప్రాజెక్టు పూడికతీత పనులు వెంటనే చేపడతాం. 300 కోట్లతో రెండవ గ్యాంటి క్రెన్ మంజూరు చేస్తున్నాం. 4 టీఎంసీల నీటిని ర్యాలంపాడు రిజర్వాయర్లో నింపేలా పనులు చేపడుతాం. మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేస్తాం. 90శాతం పూర్తయినా నెట్టెంపాడు పనులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. రూ. 2753 కోట్లు మంజూరు చేశాం. డిసెంబర్ నాటికి 100 శాతం పనులు చేసి నెట్టెంపాడు పూర్తి చేస్తాం. మక్తల్ లో పెండింగ్ లో ఉన్న పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం అని ఉత్తమ్ తెలిపారు.