
ఏపీ,తెలంగాణ మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను ఆపడానికి చట్టపరంగా ముందుకెళ్తామని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బనకచర్లతో తెలంగాణకు నష్టమన్న ఉత్తమ్.. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేందుకు న్యాయపోరాటానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 25న జల సౌధలో సీనియర్ నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 30న మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా భవన్లో గోదావరి -బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. గత BRS పాలనలో ఈ ప్రాజెక్టు ఎలా ఉద్భవించిందో స్పష్టమైన డాక్యుమెంటేషన్ను చేర్చడానికి ప్రజెంటేషన్ను రెడీ చేయాలని ..తద్వారా ఆంధ్ర ప్రస్తుత చర్య వెనుక ఉన్న రాజకీయ నేపథ్యాన్ని బహిర్గతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఇప్పటికే జూన్ 19న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. బనకచర్లపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచర్ల నిర్మిస్తోందని కంప్లైంట్ ఇచ్చామని భేటీ తర్వాత మంత్రి ఉత్తమ్ తెలిపారు..తమ అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కు చెప్పినట్లు తెలిపారు. ఏపీ చట్ట వ్యతిరేకింగా నిర్మాణం చేపడుతుందని.. అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బనకచర్ల నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. బనకచర్ల పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ రైతుల్లో ఆందోళన నెలకొందని, బనకచర్లకు అనుమతి ఇవ్వద్దని కోరినట్లు చెప్పారు.
ఏపీ తీరుతోనే వివాదం..
సముద్రంలో కలిసే గోదావరి జలాల విషయంలో వాస్తవాలు, రాజకీయాలు ముడిపడి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘వాస్తవానికి సముద్రంలో కలిసే జలాలపై ఏపీ, తెలంగాణ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యేది. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం దగ్గరకు వెళ్లడం సరికాదు. ఇది బీఆర్ఎస్కు రాజకీయ ఆయుధంగా మారింది. ఏపీ విభజన చట్టం–2014లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల కోసం ఆఫీసర్స్, టెక్నికల్, అపెక్స్ కౌనిల్స్ ఏర్పాటు చేశారు.
►ALSO READ | ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు