
జూబ్లీహిల్స్, వెలుగు: ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తల్లి ప్రేమలత ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. మంగళవారం (సెప్టెంబర్ 30) జూబ్లీహిల్స్లోని ఎన్ కన్వెన్షన్లో ఆమె దశదినకర్మ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి హాజరై, ప్రేమలత ఫొటోకు నివాళులర్పించారు. అనంతరం భాను ప్రసాద్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.